Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం గదికి వెళ్ళి కింద పడిన వరుడు, ఆసుపత్రికి తీసుకెళితే కరోనా పాజిటివ్, అంతే!!

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (19:09 IST)
కరోనావైరస్‌తో ఎంతోమంది చనిపోతున్నారు. మరికొంతమంది అనారోగ్యం పాలవుతూ చివరకు ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఒక నవ వరుడు కరోనాతో మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అది కూడా పెళ్ళయిన 10 రోజులకే.
 
చిత్తూరు జిల్లా వి.కోటమండలం వెర్ని గ్రామం. ఈ నెల 12వ తేదీ కుటుంబ సభ్యులు పరిమిత సంఖ్యలో హాజరై వివాహం జరిపించారు. రాత్రికి శోభనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. వరుడి గదిలోకి వధువును పంపించారు. సరిగ్గా 10 నిమిషాలకే వధువు పెద్దగా కేకలు వేసింది.
 
ఏం జరిగిందో అర్థంకాక బంధువులందరూ పరిగెత్తుకు వెళ్ళారు. అప్పటికే వరుడు మంచం మీద నుంచి కిందపడిపోయాడు. స్పృహలో లేడు. వెంటనే వేలూరు సిఎంసికి తీసుకెళ్ళారు. అయితే ఆసుపత్రిలో మొదటగా ట్రూనాట్ పరీక్ష చేసి పాజిటివ్‌గా నిర్థారించారు.
 
దాంతో పాటు పక్షవాతం కూడా జత కావడంతో సీరియస్ కండిషన్‌లోకి వెళ్ళిపోయాడు. చివరకు చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కాళ్ళ పారాణి ఆరక ముందే భర్త చనిపోవడంతో ఆ నవ వధువు తీవ్రంగా కన్నీంటి పర్యంతమవుతోంది. వరుడు బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments