Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరువారాల్లోగా రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (11:43 IST)
నవ్యాంధ్ర రాజధానిపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి ప్రభుత్వం ప్రత్యేక అధికారాలను కల్పించింది. తొలి సమావేశం జరిగిన ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రణాళిక రూపకల్పన కోసం నియమించిన నిపుణుల కమిటీ విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో నిపుణుల కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటన చేసేందుకు అధికారాలు కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

సమాచార సేకరణ కోసం అన్ని స్థాయిల్లోని ప్రభుత్వోద్యోగులతో సంప్రదింపులు జరిపే అధికారాన్ని నిపుణుల కమిటీకి ప్రభుత్వం కట్టబెట్టింది. క్షేత్రస్థాయి పర్యటనలు వివిధ వర్గాలతో నిపుణుల కమిటీ సంప్రదింపులు జరపనుంది. కమిటీ కార్యాకలాపాల నిర్వహణకు కావాల్సిన సిబ్బంది ఇతర అవసరాలను సీఆర్డీఏ సమకూర్చనుంది.

ప్రభుత్వంతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసరుగా సీఆర్డీఏ అదనపు కమిషనర్ విజయ కృష్ణన్ వ్యవహరించనున్నారు. తొలి సమావేశం జరిగిన ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments