పవన్ ఫ్యాన్స్‌పై ఫైర్ అయిన రేణూ దేశాయ్.. ఇక ఆపండి..

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (18:34 IST)
ఓటు ఎవరికి వేయాలో తనకు తెలుసంటూ..తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదంటూ..అదే పనిగా తనకు మెసేజ్‌లు వస్తుంటే చాలా చిరాకుగా ఉందని పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ వాపోయారు. 
 
తనను విసిగించవద్దంటూనే, తన ఓటు ఇక్కడ లేదని, తన ఓటు పూణె నగరంలో ఉందని, అక్కడ ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ జరగనుందని, అక్కడే తాను ఓటును వేయబోతున్నానని, అలాగే ఓటు ఎవరికి వేయాలో తనకు ఫుల్ క్లారిటీ ఉందని ఆమె తెలిపారు.
 
ఓటు హక్కు ప్రాధాన్యత గురించి తనకు క్లాసులు పీకడం మానాలంటూ తనకు సలహాలిస్తున్న ఫ్యాన్స్‌ని స్మూత్‌గా మందలించింది. తనకు ఎలాంటి సందేశాలు పంపవద్దని, సలహాలు ఇవ్వొద్దని పవన్ అభిమానులకు గట్టిగా సమాధానం చెప్పింది. తన వాల్‌పై ఫోటోలు పెట్టి రచ్చ చేయకండని విజ్ఞప్తి చేసింది. ఓటు వేయడం అందరి బాధ్యత అని ఆమె వివరించింది. 
 
ప్రస్తుతానికి రేణూ దేశాయ్ తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న చిత్రంలో అతడికి అక్కగా కనిపించనుంది. మరో ప్రాజెక్ట్ రైతు సమస్యలపై సాగే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం చేస్తూ బిజీగా గడుపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika NM: ఫెయిల్యూర్స్ వస్తే బాధపడతా.. వెంటనే బయటకు వచ్చేస్తా : నిహారిక ఎన్ ఎం.

Akshay Kumar: హైవాన్ క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరిచింది : అక్షయ్ కుమార్

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి నుదుటిపై గాయం ఎందుకయింది, ఎవరు కొట్టారు...

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments