Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుత్తిలో ఈవీఎంను నేలకేసి కొడితే? పవన్ కల్యాణ్ (Video)

గుత్తిలో ఈవీఎంను నేలకేసి కొడితే? పవన్ కల్యాణ్ (Video)
, గురువారం, 11 ఏప్రియల్ 2019 (11:41 IST)
ఏపీలో ఈవీఎంలు మొరాయించాయని ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా బాబు బాటలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఈవీఎంలు పనిచేయట్లేదని ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 10 శాతానికి పైగా ఈవీఎంలు పనిచేయడం లేదన్నారు.


అవి ఎందుకు పనిచేయడం లేదో తమకు తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ఓ పార్టీకి ఓటు వేస్తే మరో పార్టీకి పడుతున్నట్లు తమకు రిపోర్టులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలని ఎలక్షన్ కమిషన్, కమిషనర్‌ను కోరారు.
 
మరోవైపు అనంతపురం జిల్లా గుత్తిలో ఏర్పాటుచేసిన ఈవీఎంను గురువారం జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా నేలకేసి కొట్టిన సంగతి తెలిసిందే. పోలింగ్ కంపార్ట్ మెంట్‌లో నియోజకవర్గం పేరును సరిగ్గా రాయలేదని ఆగ్రహం వ్యక్తంచేసిన గుప్తా, పోలింగ్ కేంద్రంలో ఇతర పార్టీల ఏజెంట్లతో గొడవ పడ్డారు. ఈ సందర్భంగా ఈవీఎంను నేలకేసి కొట్టడంతో అది పనిచేయకుండా పోయింది. 
 
దీంతో పోలింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా విజయవాడలో పవన్ కల్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యంలో మీడియా ఈ వ్యవహారంపై ఆయన్ను ప్రశ్నించింది.
 
దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ గుత్తిలోని బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 183వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగినట్లు తాను మీడియాలో చూశానని తెలిపారు. వాస్తవాలేంటో తెలుసుకుని మాట్లాడుతానని పవన్ చెప్పారు. చూడండి ఆయన మాటల్లోనే...
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైకిల్ గుర్తుకు ఓటేస్తే... ఫ్యాను లాగేస్తోంది : చంద్రబాబు