Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐజీఎస్టీ బకాయిలు త్వరగా విడుదల చేయండి: మంత్రి బుగ్గన

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (08:14 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (వర్చువల్ సమావేశం) ఢిల్లీ నుంచి జరిగింది. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ, 2020-21 సంవత్సరంలో రావాల్సిన కాంపెన్సేషన్  బకాయిలలో కొంత విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

మిగిలిన ఐజీఎస్టీ బకాయిలు కూడా త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంచే విధించి వసూలు చేయబడుతున్న సెస్సులు, సర్ ఛార్జీలు, డివిజబుల్ పూల్ లేనందువల్ల రాష్ట్రాల ఆదాయం తగ్గి ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలకు పట్ల కేంద్రంగా ఉదారంగా వ్యవహరించాలని కోరారు.

కౌన్సిల్ సమావేశంలో ప్రాముఖ్యత ఉన్న అంశాలను అంగీకారం తెలుపుతూ వాటికి సరైన విధాన రూపకల్పన చేయాలని సూచించారు. కాంపెన్సేషన్ విషయంలో ఏకాభిప్రాయం కొరకు మరిన్ని సమావేశాలు, లోతైన అధ్యయనం జరగాలని తెలియజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులతో పాటు ప్రస్తుతం కొవిడ్ వల్ల ప్రజారోగ్యం మీద అదనపు ఖర్చులు చేయాల్సి వస్తుండడంతో రాష్ట్రాల వనరులపై అదనపు భారం పడుతోందని చెబుతూ, ప్రస్తుత క్లిష్ట సమయంలో కేంద్రం వెంటనే అన్ని బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments