Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త జిల్లాల బాదుడు పేరుతో కొత్త బాదుడు

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (14:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 13 కొత్త జిల్లాలను ఏర్పాటుచేసింది. దీంతో ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరింది. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను ఆమాంతం పెంచేసింది. ఈ పెంపు 15 శాతం నుంచి 75 శాతం వరకు వుంది. అంటే సగటున 20 శాతం మేరకు భారం మోపింది. ముఖ్యంగా, కొత్త జిల్లా కేంద్రాలు, వాటికి ఆనుకునివుండే శివారు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పెంపుదల భారీగా ఉంది. ఈ రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతూ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. 
 
అయితే, ఈ పెరుగుదల పాత జిల్లాల్లో కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఆగస్టు నుంచి పెంపుదల అమల్లోకి రానుంది. ఈ పెంపుదల కూడా ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉండనుంది. జిల్లా కేంద్రాలు, పక్కనున్న శివారు ప్రాంతాలు, ఆనుకునివున్న గ్రామీణ ప్రాంతాల్లో సబ్‌రిజిస్ట్రార్లు ఎక్కడికక్కడ విలువలు ఎంత పెంచాలన్నదానిపై ప్రతిపాదనలు తయారు చేశారు. 
 
దానిపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఆమోదం తెలిపింది. ఆయా ప్రాంతాల్లోని అభివృద్ధి, అక్కడ వాస్తవ మార్కెట్ విలువలు, తదితరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రిజిస్ట్రేషన్ల చార్జీలను పెంచారు. దీంతో ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఈ పెంపుదల ఉండనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments