Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు...

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (18:50 IST)
ఏప్రిల్ మాసం ప్రారంభమైంది. వేసవికాలం వచ్చేసింది. రోజురోజుకూ పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మండిపోతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్ నగరంలో సోమవారం (ఏప్రిల్ 1) నాడు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలు మున్ముందు మరింతగా పెరుగుతాయని  వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
మంగళవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని.. ఈ ప్రభావంతో వేడి మరింతగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆదివారం ఉష్ణోగ్రతలను చూస్తే అత్యధికంగా రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళబయ్యారం, నిర్మల్ జిల్లాపెంబిలలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 
 
కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, నిర్మల్‌ జిల్లా భైంసా, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది.
 
మరోవైపు ఆంధ్ర ప్రదేశ్‌లో సైతం భానుడి ప్రతాపం రోజు రోజుకూ ఎక్కువ అవుతోంది. ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలులో కూడా వాతావరణం పొడిగా ఉంటూ వేడి గాలులతో 40 కంటే ఎక్కువ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేసవిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ఉదయం 10 గంటలపైన ఎండలో తిరగవద్దని హెచ్చరిస్తోంది. వడదెబ్బ తగిలే ప్రమాదాలు ఎక్కువగా ఉండటం వల్ల తగుజాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇప్పటికే ప్రచారం చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments