జగన్ చెంతకే వల్లభనేని వంశీ... అడ్డుతగులుతున్న యార్లగడ్డ

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (13:55 IST)
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు జగన్ చెంతకు చేరాలని నిర్ణయించుకున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన బీజేపీలో చేరుతారా? లేదా? వైకాపా తీర్థం పుచ్చుకుంటారా అనే అంశంపై సందిగ్ధత వుండేది. అయితే, ఆయన వైకాపాలో చేరేందుకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
 
వచ్చే నెల మూడో తేదీన జరిగే ఓ కార్యక్రమంలో వల్లభనేని వంశీ వైకాపాలో చేరుతారని తెలుస్తోంది. ఆయనకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆహ్వానించి, వైకాపా కండువా కప్పుతారని సమాచారం. ఒకవైపు ఆయన పార్టీ మార్పును నిలువరించేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తున్నా వంశీ మాత్రం అంగీకరించడం లేదని తెలుస్తోంది.
 
అదేసమయంలో వల్లభనేని వంశీ రాకను కూడా గన్నవరం వైసీపీ ఇన్ చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన తన మనసులోని మాటను ఇప్పటికే జగన్‌కు చెప్పేందుకు ప్రయత్నించినా, సీఎం అపాయింట్మెంట్ మాత్రం దొరకలేదు. 
 
కానీ యార్లగడ్డ మాత్రం సోమవారం జగన్ నివాసానికి వెళ్లి చాలాసేపు నిరీక్షించారు. అయినప్పటికీ జగన్ కనికరించలేదు. దీంతో ఆయన తీవ్ర నిరాశతో తిరిగివెళ్లారు. మరోవైపు, వంశీ రాజీనామా చేసిన తర్వాతనే వైసీపీలోకి వచ్చేందుకు నిర్ణయించుకోవడంతో ఉప ఎన్నికలు వస్తే, స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీకి దిగాలని యార్లగడ్డ భావిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments