Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం: రఘురామ

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (16:15 IST)
అమరావతి రాజధాని భూముల విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని ఎంతో కాలంగా నిందలు వేశారని, ఇప్పుడేమంటారని వైసీపీ నేతలను ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అబద్ధాలను ప్రచారం చేశారని, దాని వల్ల 150 మందికి పైగా రైతులు మృతి చెందారని తెలిపారు. వారి చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించి, సీఎం జగన్‌ ఓదార్చాలని కోరారు. విశాఖలో తమ ప్రభుత్వం వచ్చాక ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని ఎత్తి చూపారు. దసపల్లా హోటల్ భూములు ఎవరి చేతుల్లోకి వెళ్లాయో తెలాలని, నిజాయితీగల అధికారితో ఉత్తరాంధ్రలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదా అంశంపై సీఎం ఆదేశిస్తే రాజీనామాకు ఎంపీలందరం సిద్ధమని రఘురామ ప్రకటించారు. ‘‘నాపై అనర్హత వేటు పడదు. మీ బెయిల్ రద్దు చేయమని అనడం రాజద్రోహం ఎలా అవుతుంది. వాట్సాప్‌లో చాటింగ్ బయట పెట్టామని అంటున్నారు.. నా ఫోన్ పోలీసులు తీసుకున్నారు. పెగసెస్ సాఫ్ట్‌వేర్ మీరు తెప్పించారని అంటున్నారు. మీరు చాలా మందిపై వాడారని అంటున్నారు, మీరు కేంద్రం అనుమతి తీసుకున్నారా?’’ అని రఘురామ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments