Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ ఛార్జీలపై బహిరంగ చర్చకు సిద్ధం: వైసీపీకి బీజేపీ సవాల్

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (10:31 IST)
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో విద్యుత్ ఛార్జీలు ఎక్కువుగా వసూలు చేస్తున్నారని బీజేపీ నేత పాతూరి నాగభూషణం ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ చేసిన వ్యాఖ్యలను రాజకీయంగా చూడటం సరి కాదన్నారు.

ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం రెడ్డి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల విషయంలో బహిరంగ చర్చకు తాము సిద్ధమని... దమ్ముంటే వైసీపీ నేతలు రావాలని సవాల్ విసిరారు. ఏపీలో కరెంటు కోతలు లేవంటే.. అది కేంద్రం అమలు చేస్తున్న విధానాల వల్లే అన్నారు.

కరోనా కష్టకాలంలో ప్రజలు ఉంటే.. రెండు, మూడు నెలల  బిల్లును ఒకేసారి ఇచ్చి  శ్లాబు పెంచి వసూలు చేశారని ఆయ‌న ఆరోపించారు. బీజేపీ సీనియర్ నేత సత్యమూర్తి మాట్లాడుతూ... కరోనా కష్ట కాలంలో మోదీ చేపట్టిన చర్యలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు.

ఈ ఏడాది పాలనలో అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో పాటు, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. బీజేపీ ఏపీకి చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

తెలుగువాళ్లకు గర్వకారణమైన పీవీ శతజయంతి ఉత్సవాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ఆయన సేవలకు గుర్తుగా జయంతి ఉత్సవాలను నిర్వహించాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments