ప్రధాని మోడీ ఏమైనా పెద్ద పోటుగాడా?: ఎంపీ రాయపాటి ప్రశ్న

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు మండిపడ్డారు. ప్రధానమంత్రిని చూసి కేంద్రమంత్రులు వణికిపోతున్నారని, ప్రధాని ఏమైనా పెద్ద పోటుగాడా అంటూ ప్రశ్నించారు.

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (11:13 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు మండిపడ్డారు. ప్రధానమంత్రిని చూసి కేంద్రమంత్రులు వణికిపోతున్నారని, ప్రధాని ఏమైనా పెద్ద పోటుగాడా అంటూ ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీని బీజేపీకి చెందిన నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఆయనపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకతలు ఉన్నాయన్నారు. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఏపీని మోడీ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే బీజేపీని నమ్ముతామని చెప్పారు. 
 
ఇకపోతే తమ పార్టీ అధినేత ఆదేశిస్తే, రాజీనామాలు చేయడానికైనా, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికైనా తాము సిద్ధమేనన్నారు. బీజేపీతో పొత్తు కొనసాగుతుందా? లేదా? అనే విషయం త్వరలోనే తేలిపోతుందన్నారు. తమ అధినేత చంద్రబాబు మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. 
 
అయితే, ఏ క్షణమైనా టీడీపీ - బీజేపీల మధ్య ఉన్న పొత్తు తెగిపోవచ్చని చెప్పారు. ప్రత్యేక హోదా సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, ఇప్పటి వరకు ప్రధాని ఏపీకి ఇచ్చింది చెంబు నీళ్ళు, ముంతడు మట్టి మినహా ఇంకేముంది బూడిద అంటూ ఫైరయ్యారు. 
 
ఏపీలో జరుగుతున్న పరిస్థితులు మోడీకి తెలుసు. ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదు. ఇక వేచి చూసే ధోరణి మానుకుంటున్నాం. తిరుగుబావుటాకు సిద్ధమయ్యాం. మా తడాఖా ఏమిటో చూపిస్తామంటూ హెచ్చరించారు. చంద్రబాబు ఎప్పుడు ఏం చేయమన్నాం సిద్ధంగా ఉన్నాం, పార్టీ పదవులు మాకు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యమని రాయపాటి చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments