Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగియనున్న చిరంజీవి పదవీకాలం.. రాజకీయాలకు స్వస్తి?

మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ పదవీకాలం వచ్చే నెల రెండో తేదీతో ముగియనుంది. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పనున్నారు.

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (10:59 IST)
మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ పదవీకాలం వచ్చే నెల రెండో తేదీతో ముగియనుంది. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పనున్నారు. వాస్తవానికి చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తన పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన ఎలాగో మళ్లీ రాజ్యసభ పదవి ఛాన్స్ లేకపోవడంతో రాజకీయాలకు స్వస్తి చెప్పి, పూర్తిగా సినిమాలపై దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్నారు. 
 
మరోవైపు, చిరంజీవితో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరికొందరు ఎంపీల పదవీ కాలం కూడా ఏప్రిల్ రెండో తేదీతో ముగియనుంది. వీరిలో తెలంగాణ రాజ్యసభ సభ్యులు దేవేందర్‌ గౌడ్‌, రాపోలు ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్థన్ రెడ్డి‌లతో పాటు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు చిరంజీవి, రేణుకా చౌదరి, సీఎం రమేష్‌‌‌ల పదవీకాలం ముగియనుంది. 
 
ఈ నేపథ్యంలో ఆ ఆరు స్థానాలతో పాటు 16 రాష్ట్రాల్లోని మొత్తం 58 రాజ్యసభ స్థానాల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ స్థానాలన్నింటికీ మార్చి 23న తెలంగాణ, ఏపీల్లోని ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments