Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆ రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు

ఠాగూర్
ఆదివారం, 10 నవంబరు 2024 (10:41 IST)
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది పశ్చిమ దిశగా పయనించి తమిళనాడు, శ్రీంలక తీరంవైపు వెళుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు మరోమారు భారీ వర్ష ముప్పు పొంచివుందని హెచ్చరించింది. 
 
అల్పపీడన ప్రభావంతో సోమవారం నుంచి మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలోని అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఆ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కాబట్టి మత్స్యుకారులు చేపల వేటకు వెళ్లవొద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాగా, శనివారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసిన విషయం తెల్సిందే. 
 
సజ్జల కుమారుడిపై అట్రాసిటీ కేసు... ఎక్కడ? 
 
గత వైకాపా ప్రభుత్వంలో సకల శాఖామంత్రిగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు, వైకాపా సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఏపీ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కడప జిల్లా పులివెందులలో ఈ కేసు నమోదైంది. ఈ జిల్లాలోని సింహాద్రిపురానికి చెందిన హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్ రెడ్డితో పాటు వైకాపా సోషల్ మీడియా కార్యకలాపాలను నిర్వహించే అర్జున్ రెడ్డి, వర్రా రవీంద్రారెడ్డిలపై పులివెందుల పట్టణ పోలీసులు కేసులు నమోదు చేశారు. 
 
జగన్‌ను విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో గత ఐదేళ్లుగా రవీంద్రారెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టిన విషయం తెల్సిందే. దీనిని ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించాడంటూ హరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుతో ముగ్గురిపై అట్రాసిటీ కేసును నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

నన్ను చాలా టార్చర్ చేశాడు.. అందుకే జానీ మాస్టర్‌పై కేసు పెట్టాను.. బన్నీకి సంబంధం లేదు.. సృష్టి వర్మ (video)

ఐటీ సోదాల ఎఫెక్ట్.. 'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్లు ఎంతో తెలుసా?

కన్నప్ప నుంచి త్రిశూలం, నుదుట విబూదితో ప్రభాస్ చూపులు లుక్

తల్లి మనసు కి వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలి:ఆర్.నారాయణమూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

తర్వాతి కథనం
Show comments