Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను ఎత్తుకుపోయి?

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (14:33 IST)
ఇంటిముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను ఎత్తుకుపోయి అత్యాచారం చేసి చంపేశాడు ఓ దుర్మార్గుడు. ఈ దుర్ఘటన మేడ్చల్‌ జిల్లా అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తుర్కపల్లిలో గురువారం చోటుచేసుకుంది. చంద్రయ్య, కృష్ణవేణి దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం మెదక్‌ జిల్లా నుంచి నగరానికి వలస వచ్చి తుర్కపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. 
 
గురువారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటున్న పాప కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఎక్కడ వెతికినా కనిపించలేదు. చివరికి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. రాత్రి 12 గంటల సమయంలో అటుగా వెళ్తున్న కొందరికి శవం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అది పాపదేనని గుర్తించారు. 
 
పోస్ట్‌మార్టం చేయించారు. బాలికను అత్యాచారం చేసి గొంతు నులిమి చంపినట్లు పంచనామాలో తేలింది. బాధితురాలి ఇంటి ప్రక్కన ఉన్న బిహార్‌కు చెందిన ఆరుగురు యువకులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments