Webdunia - Bharat's app for daily news and videos

Install App

శభాష్ కేసీఆర్.. 12వ తరగతి వరకు తెలుగు తప్పనిసరి: రామోజీరావు కితాబు

తెలుగు భాషను తెలంగాణలో తప్పనిసరి చేయడంతో పాటు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అభినందనలు తెలిపారు. తెలుగు భాషను 12వ త

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (18:11 IST)
తెలుగు భాషను తెలంగాణలో తప్పనిసరి చేయడంతో పాటు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అభినందనలు తెలిపారు. తెలుగు భాషను 12వ తరగతి వరకు తప్పనిసరి చేయడం గొప్ప విషయమని కేసీఆర్‌ను ఆయన కొనియాడారు.

ఇంకా పాలనా వ్యవహరాల్లో తెలుగును అనివార్యం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు భాషకు గుర్తింపు రావాలంటే, తెలుగు కనుమరుగు కాకుండా వుండాలంటే.. ఇదేవిధంగా ముందుకు సాగాలని.. ఉద్యోగ నియామకాల్లో కూడా తెలుగు ప్రజ్ఞను అనివార్యం చేయాలని సూచించారు. 
 
ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రామోజీ రావు లేఖ రాశారు. ప్రపంచ తెలుగు మహాసభలను తొలిసారి రాష్ట్రంలో నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. తెలుగు భాషను మరింత విస్తృతం చేయాలంటే... పరిపాలనా వ్యవహారాల్లో కూడా తెలుగును తప్పనిసరి చేయాలని రామోజీరావు తన లేఖలో అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేయడం బలమైన నిర్ణయమని ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments