Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మాట చెప్పేవరకూ రమణదీక్షితులను వదిలే ప్రసక్తే లేదు: లక్ష్మణ్‌

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (20:39 IST)
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ చేసిన అర్చకులను తిరిగి వైసిపి ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో ప్రధానంగా తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకులు రమణదీక్షితులు కూడా ఉన్నారు. అయితే ఈయనే ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. 
 
రమణదీక్షితులతో పాటు మరికొంతమంది అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ టిటిడి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రమణదీక్షితులు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాక్షాత్తు విష్ణువు అవతారంలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు.
 
ఇది కాస్త హిందూ ధార్మిక సంఘాలను ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఒక వ్యక్తిని దేవుడితో ఎలా పోలుస్తారు.. ఖచ్చితంగా అందుకు భక్తులకు రమణదీక్షితులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిని ఈరోజు తెల్లవారుజామున బిజెపి ఓబిసి మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ దర్సించుకున్నారు.
 
దర్సనం తరువాత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్ రమణదీక్షితులపై మండిపడ్డారు. బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు రమణదీక్షితులను వదిలిపెట్టేది లేదంటున్నారు లక్ష్మణ్. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నుంచి హిందూ ధార్మిక సంఘాల వరకు అందరూ ఈ విషయంపై చాలా సీరియస్‌గా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments