Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మాట చెప్పేవరకూ రమణదీక్షితులను వదిలే ప్రసక్తే లేదు: లక్ష్మణ్‌

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (20:39 IST)
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ చేసిన అర్చకులను తిరిగి వైసిపి ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో ప్రధానంగా తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకులు రమణదీక్షితులు కూడా ఉన్నారు. అయితే ఈయనే ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. 
 
రమణదీక్షితులతో పాటు మరికొంతమంది అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ టిటిడి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రమణదీక్షితులు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాక్షాత్తు విష్ణువు అవతారంలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు.
 
ఇది కాస్త హిందూ ధార్మిక సంఘాలను ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఒక వ్యక్తిని దేవుడితో ఎలా పోలుస్తారు.. ఖచ్చితంగా అందుకు భక్తులకు రమణదీక్షితులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిని ఈరోజు తెల్లవారుజామున బిజెపి ఓబిసి మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ దర్సించుకున్నారు.
 
దర్సనం తరువాత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్ రమణదీక్షితులపై మండిపడ్డారు. బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు రమణదీక్షితులను వదిలిపెట్టేది లేదంటున్నారు లక్ష్మణ్. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నుంచి హిందూ ధార్మిక సంఘాల వరకు అందరూ ఈ విషయంపై చాలా సీరియస్‌గా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments