Webdunia - Bharat's app for daily news and videos

Install App

23న రాజ్యసభ ఎన్నికలు... దేశ వ్యాప్తంగా 58 సీట్లకు ఓటింగ్

దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న, పదవీ కాలం ముగిసిన రాజ్యసభ స్థానాల భర్తీ కోసం ఈనెల 23వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం ఈనెల 5వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది.

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (19:07 IST)
దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న, పదవీ కాలం ముగిసిన రాజ్యసభ స్థానాల భర్తీ కోసం ఈనెల 23వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం ఈనెల 5వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. 16 రాష్ట్రాలకు చెందిన 58 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో ముగియనుండటంతో ఆయా స్థానాలకు ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. 
 
అయితే, రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఏపీలో మూడు, తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కె.చిరంజీవి, రేణుక చౌదరి, టి.దేవేందర్‌ గౌడ్‌, తెలంగాణలో సి.ఎం రమేష్‌, రాపోలు ఆనంద్‌ భాస్కర్‌, పాల్వాయి గోవర్థన్‌ రెడ్డిల పదవీ కాలం ఏప్రిల్‌ 2తో ముగియనుంది. పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి ఇటీవలే మృతి చెందారు. 
 
ఇకపోతే, పదవీ విరమణ చేసేవారిలో నలుగురు కాంగ్రెస్‌ సభ్యులు కాగా, ఇద్దరు టిడిపి సభ్యులు. దేశవ్యాప్తంగా రిటైరయ్యే ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, రవిశంకర్‌ ప్రసాద్‌, ధర్మేంద్ర ప్రదాన్‌, జేపీ నడ్డా, ప్రకాశ్‌ జవదేకర్‌, తావర్‌ చంద్‌ గెహ్లాట్‌, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, నరేష్‌ అగర్వాల్‌, జయా బచ్చన్‌ తదితరులు వున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments