Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌మండ్రి ఎంపీ భరత్ రామ్ కు భారత్ యూత్ అవార్డు

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (09:11 IST)
రాజమహేంద్రవరం ఎంపీ, వై ఎస్ ఆర్ సి పి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ "భారత్ యూత్ అవార్డు"ను అందుకున్నారు. భారత్ గౌరవ అవార్డు పౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో భారత్ యూత్ అవార్డు ప్రధానోత్సవం న్యూఢిల్లీలో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర అర్బన్ ఎఫైర్స్ శాఖ మంత్రివర్యులు కౌశల్ కిషోర్ చేతుల మీదుగా ఎంపీ భరత్ రామ్ కు భారత్ యూత్ అవార్డు ప్రధానం చేశారు. ఎంపీ భరత్ రామ్ కు అవార్డు ను పురస్కరించుకొని ఎంపీలు, ఎమ్మెల్సీలు, అభిమానులు, నాయకులు అభినందనలు తెలియజేశారు.

యువ ఎంపీగా భ‌ర‌త్ రామ్ మ‌రిన్ని శిఖ‌రాల‌ను అధిరోహించాల‌ని, ఆయ‌న యువ రాజ‌కీయ వేత్త‌గా ఎద‌గాల‌ని రాజ‌మండ్రి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోని పలువురు ఎంపీకి అభినంద‌న‌లు తెలిపారు.

భార‌త దేశానికి ఇపుడు యువ నాయ‌క‌త్వం చాలా అవ‌స‌రం అని, ఇలాంటి పుర‌స్కారాలు యువ‌త మ‌దిలో రాజ‌కీయ చైత‌న్యాన్ని, స‌మాజ సేవ‌త‌త్ప‌ర‌త‌ను నింపుతాయ‌ని పేర్కొంటున్నారు. అవార్డు అందుకున్న ఎంపీ భ‌ర‌త్ రామ్ మాట్లాడుతూ, త‌న బాధ్య‌త‌ను ఈ అవార్డు మ‌రింత పెంచింద‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నువ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

బ్రెయిన్ ఎన్యోరిజమ్‌ సమస్యతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్!! (Video)

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments