Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి... కాటికి పంపిన వైద్యులు ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (08:49 IST)
కడపు నొప్పికి చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తిని హైదరాబాద్ నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు కాటికి పంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ విచిత్రమేమింటే.. ఆస్పత్రికి బాగా నడుచుకుంటూ వచ్చిన వ్యక్తికి వైద్యులు వేసిన ఓ ఇంజెక్షన్‌తో కేవలం గంటలోపే సదరు వ్యక్తి చనిపోయాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మల్లేష్ గౌడ్ అనే వ్యక్తి కడుపునొప్పితో ఓ కార్పొరేట్ ఆస్పత్రికి ప్రాథమిక వైద్యానికి వచ్చాడు. దీంతో వైద్యులు పరీక్షలు చేసి అతడికి ఇంజక్షన్ ఇచ్చారు. కానీ గంటలోపే ఆ వ్యక్తి కదల్లేని పరిస్థితి నెలకొంది. అనంతరం అతడు నొప్పితోనే చనిపోయాడు.
 
అయితే డాక్టర్లు ఇచ్చిన ఇంజక్షన్ వికటించడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది, కుటుంబసభ్యులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. 
 
సీసీ ఫుటేజీ విడుదల చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బంధువులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments