Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంద డిగ్రీల వేడిలో చికెన్ ఉడికించి ఆరగిస్తే బర్డ్ ఫ్లూ సోకదా?

ఠాగూర్
సోమవారం, 3 మార్చి 2025 (08:25 IST)
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తుంది. దీంతో అనేక ప్రాంతాల్లో కోళ్లు వందల సంఖ్యలో చనిపోతున్నాయి. ఈ కారణంగా చికెన్ విక్రయాలు పడిపోయాయు. ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న భయాన్ని, అపోహలను తొలగించేందుకు వివిధ ప్రాంతాల్లో చికెన్ మేళాలను నిర్వహిస్తున్నారు. వీటికి చికెన్ ప్రియుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. 
 
తాజాగా రాజమండ్రి అజాద్ చౌక్ సెంటరులో చికెన్ సేల్ అండ్ రిటైల్ వర్తక సంఘం ఆధ్వర్యంలో చికెన్ మేళా ఏర్పాటు చేశారు. దీనికి మాంసాహారుల నుంచి విశేష స్పందన వచ్చింది. చికెన్ వంటకాలను ఆరగించడానికి స్థానిక నాన్ వెజ్ ప్రియులు బారులు తీరారు. ఈ మేళాలో వివిధ రకాల చికెన్ వంటకాలను ఏర్పాటు చేశారు. 
 
వంద డిగ్రీల వేడితో చికెన్ ఉడికించి తినడం వల్ల బర్డ్ ఫ్లూ మనిషికి వచ్చే అవకాశం లేదని తెలియజేసేందుకే ఈ మేళా ఏర్పాటు చసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, గుడ్డు అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిందని, పౌల్ట్రీ రంగానికి అపారనష్టం వాటిల్లిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈ మేళాకు ప్రజల నుంచి మంచి స్పందన లభించడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని వారు తెలిపారు. కాగా, బర్డ్ ఫ్లూ భయంతో గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చికెన్ వంటకాలను ఆరగించడం మానేయడంతో వీటి విక్రయాలతో పాటు ధరలు కూడా ఒక్కసారిగా పడిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments