Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తినలో టీడీపీ చీఫ్ చంద్రబాబుతో వైకాపా రెబెల్ ఎంపీ భేటీ

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (18:12 IST)
ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కలుసుకున్నారు. ఈ భేటీ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ భేటీ తర్వాత రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాల ఆఖరి రోజున ఎంపీలు రాజీనామా చేసి విభజన హామీల కోసం కేంద్రం ఒత్తిడి తెద్దామని జగన్ గతంలో అన్నారని, గుర్తుచేశారు. 
 
ప్రత్యేక హోదా కోసం రాజీనామాకు తాను సిద్ధంగా ఉన్నామని రఘురామ ప్రకటించారు. టీడీపీ ఎంపీల రాజీనామా కోసం ఒప్పించడానికే చంద్రబాబుతో భేటీ అయినట్టు ఆయన వెల్లడించారు. 
 
కాగా, అధికార వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితే విభేదించిన రఘురామకృష్ణంరాజు తనదైనశైలిలో రాజకీయాలు చేస్తున్నారు. ఆయన ఢిల్లీలో ఉంటూనే అధికార వైకాపా, ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రిపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments