Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయలసీమ ప్రాంత భవిష్యత్ కోసం హైకోర్టు సాధిస్తాం : మంత్రి బుగ్గన

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (17:22 IST)
రాయలసీమ ప్రాంత భవిష్యత్, గౌరవం కోసం హైకోర్టును తీసుకొచ్చేందుకు పోరాటం జరుగుతుందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. పైగా, కర్నూలులో ఖచ్చితంగా హైకోర్టును నిర్మిస్తామని ఆయన జోస్యం చెప్పారు. ఈ హైకోర్టు కూడా జగన్నాథ గట్టుపై పది కిలోమీటర్ల దూరం కనిపించేలా నిర్మిస్తామని ఆయన తెలిపారు.
 
కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో వైకాపా ఆధ్వర్యంలో సోమవారం రాయలసీమ గర్జన సభ నిర్వహించారు. ఇందులో రాయలసీమ ప్రాంతానికి చెందిన వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సీమ గర్జన సభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తూ, నాడు రాజధానిని కర్నూలు ప్రజలు త్యాగం చేశారని గుర్తు చేశారు. 1956లో కర్నూలు నుంచి రాజధానిని హైదరాబాద్ నగారనికి తరలించారని వివరించరు. అప్పటి నుంచి రాయలసీమ వెనుకబడిపోయిందన్నారు. 
 
ఈ క్రమంలోనే ఆయన విపక్షాలపై విమర్శలు సంధించారు. ఇపుడీ ప్రాంత అభివృద్ధి చేసే అవకాశం వచ్చిందన్నారు. సీఎం జగన్ హైకోర్టు ఇస్తానంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చంద్రబాబుకు ఇష్టం ఉందో లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
విభజన తర్వాత రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. దీంతో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ ఆశయమన్నారు. వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments