Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ బెయిల్ రద్దుపై RRR.. సీఎంను నిలదీసినందుకే కక్షకట్టి కొట్టారు..!

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (14:54 IST)
ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై మీడియా ద్వారా సీఎంను నిలదీసినందుకు, అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి బెయిల్‌ రద్దుచేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేసినందుకు కక్షకట్టి తనపై ఏపీ సీఐడీ పోలీసులు అక్రమ కేసులు పెట్టి, వేధించి, దుర్మార్గంగా కొట్టారని నరసాపురం వైసీపీ ఎంపీ కె.రఘురామకృష్ణంరాజు దుయ్యబట్టారు. 
 
రాజ్యాంగాన్ని, చట్టాన్ని, మానవ హక్కులను ఉల్లంఘించిన  సీఐడీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని రఘురామరాజు విజ్ఞప్తి చేశారు. రఘురామ తెలిపిన వివరాలన్నీ సానుకూలంగా విన్న ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ ప్రఫుల్లా చంద్ర పంత్‌.. ఈ ఘటనపై విచారణ జరిపించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు రఘురామ వర్గీయులు చెప్తున్నారు. 
 
ఏపీ సీఐడీ పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి తనను కొట్టారని, కస్టడీలో ఉండగానే కొందరు పోలీసులు ముసుగులతో వచ్చి తీవ్రంగా గాయపరిచి, మానవ హక్కులను ఉల్లంఘించారని రఘురామకృష్ణంరాజు జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ)కు ఫిర్యాదు చేశారు. 
 
సోమవారం ఆయన ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ ప్రఫుల్లా చంద్ర పంత్‌ను కలిసి, సీఐడీ పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరును వివరించారు. కాగా, రఘురామరాజు తనయుడు భరత్‌తోపాటు మరికొందరు కూడా ఎన్‌హెచ్‌ఆర్సీకి ఇదివరకే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments