Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి జిల్లాల్లో దొరుకుతున్న పులస చేప... కిలో రూ.10 వేలే

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (08:20 IST)
ఉభయ గోదావరి జిల్లాలో స్వచ్ఛమైన గోదావరిలో దొరికే పులస చేప అంటే.. ఎంతో క్రేజ్‌! ముఖ్యంగా ధవళేశ్వరం వద్ద ఇవి దొరుకుతాయి. వీటిని కొనడం కోసం వ్యాపారులు, కొనుగోలుదారులు పడిగాపులు కాస్తారు.

చూపుకు చిన్నదే అయినా బరువులో మాత్రం తక్కువేం కాదు. చిన్నగా కనిపించే చేప కూడా తక్కువలో తక్కువగా కెజి తూకుతుంది. రేటు ఇంతకుముందు కిలో 2, 3 వేల రూపాయలుండేది. ఇప్పుడు ఏకంగా రూ.10 వేలు దాటేస్తోంది.

పులస దొరుకుతున్నదాని బట్టి రేటు మారిపోతుంటుంది. ప్రస్తుతం రూ.7 వేల నుండి రూ.10 వేల వరకు పులస రేటు పలుకుతోంది. ఈ పులస చేప ఆదివారం వైనతేయ గోదావరి నదిలో పాశర్లపూడికి చెందిన మత్స్యకారుల వలకు చిక్కింది.

భారీ డిమాండు ఉన్న ఈ పులస రెండున్నర కిలోల బరువు తూగింది. కొనుగోలుదారుల హడావిడి పెరిగింది. పాశర్లపూడి గ్రామానికి చెందిన వైసిపి నేత, నగర వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమ్ముల కొండలరావు రూ.21 వేలు చెల్లించి ఈ బంగారు చేపను చేజిక్కించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments