Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి జిల్లాల్లో దొరుకుతున్న పులస చేప... కిలో రూ.10 వేలే

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (08:20 IST)
ఉభయ గోదావరి జిల్లాలో స్వచ్ఛమైన గోదావరిలో దొరికే పులస చేప అంటే.. ఎంతో క్రేజ్‌! ముఖ్యంగా ధవళేశ్వరం వద్ద ఇవి దొరుకుతాయి. వీటిని కొనడం కోసం వ్యాపారులు, కొనుగోలుదారులు పడిగాపులు కాస్తారు.

చూపుకు చిన్నదే అయినా బరువులో మాత్రం తక్కువేం కాదు. చిన్నగా కనిపించే చేప కూడా తక్కువలో తక్కువగా కెజి తూకుతుంది. రేటు ఇంతకుముందు కిలో 2, 3 వేల రూపాయలుండేది. ఇప్పుడు ఏకంగా రూ.10 వేలు దాటేస్తోంది.

పులస దొరుకుతున్నదాని బట్టి రేటు మారిపోతుంటుంది. ప్రస్తుతం రూ.7 వేల నుండి రూ.10 వేల వరకు పులస రేటు పలుకుతోంది. ఈ పులస చేప ఆదివారం వైనతేయ గోదావరి నదిలో పాశర్లపూడికి చెందిన మత్స్యకారుల వలకు చిక్కింది.

భారీ డిమాండు ఉన్న ఈ పులస రెండున్నర కిలోల బరువు తూగింది. కొనుగోలుదారుల హడావిడి పెరిగింది. పాశర్లపూడి గ్రామానికి చెందిన వైసిపి నేత, నగర వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమ్ముల కొండలరావు రూ.21 వేలు చెల్లించి ఈ బంగారు చేపను చేజిక్కించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

Dhanush: ఆయన వల్లే డంప్‌యార్డ్‌లో ఏడు గంటలపాటు నేను, రష్మిక వున్నాం: ధనుష్

Srileela: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాయిక శ్రీలీల

నాకు పొగరు నిజమే.. దానికి కారణం కూడా నేనే : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments