Webdunia - Bharat's app for daily news and videos

Install App

యానం పుష్కర ఘాట్‌లో చిక్కిన పులస - రూ.26 వేలకు విక్రయం

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (08:55 IST)
అత్యంత రుచికరమైన చేరగా పేరుకెక్కిన పులస చేప కోసం ధనవంతులు ఎంత ధరకైనా చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. ఒక్కో సందర్భాల్లో దీని ధర ఇది వేల నుంచి లక్షల్లో కూడా పలుకుతుంది. తాజాగా యానాం పుష్కర ఘాట్‌‍లో పులస చేప ఓ జాలరికి చిక్కింది. దీన్ని ఓ మహిళ రూ.19 వేలకు కొనుగోలు చేసింది. ఆమె నుంచి మరో రాజకీయ నేత రూ.26 వేలకు దక్కించుకున్నారు. 
 
మంగళవారం సాయంత్రం యానాం పుష్కర ఘాట్‌లో ఓ జాలరి వలకు ఈ పులస చిక్కడంతో అతని పంట పండింది. రెండు కిలోల బరువున్న ఈ చేపను వేలం చేయగా నాలక్ష్మి అనే మహిళ రూ.19 వేలకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఇదే చేపను రావులపాలేనికి చెందిన ప్రముఖ నాయుకుడి కోసం ఓ వ్యక్తి రూ.26 వేలకు కొనుగోలు చేశాడు. ఈ సీజన్‌లో పులసకు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గోదావరి నదికి ఎదురీదే ఈ పులస చేప ఇతర చేపల వంటకాల కంటే అత్యంత రుచికరంగా ఉంటుంది. దీనికితోడు ఈ సీజన్‌లో మాత్రమే దొరికే ఈ చేప కోసం ధనవంతులు పోటీపడుతుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: కాలేజీలో మహేష్ బాబుతో హాయ్-బై అనుకునేవాళ్లం.. కలిసి నటిస్తామని అనుకోలేదు.. త్రిష

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments