Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దాయాదుల పోరు.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టిక్కెట్లు

Advertiesment
indo - pakistan
, బుధవారం, 30 ఆగస్టు 2023 (09:32 IST)
భారత్-పాకిస్థాన్ మధ్య దాయాదుల పోరు జరుగనుంది. క్రికెట్ అభిమానులకు ఈ వార్త మస్తు మజా ఇవ్వనుంది. అక్టోబరు 5 నుంచి భారత్‌లో ఐసీసీ వరల్డ్ కప్ జరగనుంది. అక్టోబరు 14న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాక్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు జనం ఎగబడుతున్నారు. 
 
ఈ సూపర్ మ్యాచ్ కోసం నిన్న టికెట్లను అందుబాటులోకి తీసుకురాగా, కేవలం గంటలోనే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు బుక్ మై షో ద్వారా ఆన్ లైన్‌లో టికెట్ల అమ్మకాలు ప్రారంభించారు. 
 
మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు బుక్ మై షో ద్వారా ఆన్ లైన్‌లో టికెట్ల అమ్మకాలు ప్రారంభించారు. 7 గంటల తర్వాత ఒక్క టికెట్ కూడా మిగల్లేదు. సెప్టెంబరు 3న మరోసారి టికెట్ల అమ్మకం ఉంటుందని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శెభాష్ నీరజ్ చోప్రా... ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు...