Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై జీవో 35ను అమలు చేయాలని నట్టి కుమార్ పిటిషన్

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (11:21 IST)
రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల విషయంలో ఇచ్చిన జీవో 35ను అమ‌లు చేయాల‌ని నిర్మాత నట్టి కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ అంశంపై విచారణ జరిపారు. 
 
సినిమా టికెట్ల ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 8న ఇచ్చిన జీవో 35 అమలు కోసం నిర్మాత, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఆగస్టు 5 న తాను ఇచ్చిన వినతిని పరిగణనలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు. జీవో 35, ఏపీ సినిమాలు (క్రమబద్ధీకరణ) చట్టంలోని సెక్షన్లు 9,10,11 లకు అనుగుణంగా పిటిషనర్ ఇచ్చిన వినతిపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి, విశాఖపట్నం సంయుక్త కలెక్టర్, అనకాపల్లి ఆర్డీవోను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. 
 
సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల పెంపుపై జీవో 35 వివాదాస్ప‌దంగా మారిన నేప‌థ్యంలో తెలుగు సిని ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌లో ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. మ‌రో ప‌క్క రాష్ట్ర ప్ర‌భుత్వం ఆన్ లైన్ టిక్కెటింగ్ పైనా రాజ‌కీయ దుమారం చెల‌రేగింది. ఈ నేప‌థ్యంలో జీవో 35 అమ‌లుకు న‌ట్టికుమార్ కోర్టు త‌లుపులు త‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments