Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిల్లా జైలులో ఖైదీ నంబర్ 8775గా అచ్చెన్నాయుడు...

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (12:44 IST)
తన సొంత గ్రామ నిమ్మాడలో జరిగిన ఎన్నికల ఘర్షణ కేసులో తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అచ్చెన్నాయుడుని శ్రీకాకుళం జిల్లా అంపోలులోని జిల్లా జైలుకు తరలించగా, అక్కడ ఆయనకు 8775 అనే నంబరును కేటాయించారు. దీంతో అచ్చెన్నాయుడు ఖైదీ నంబర్ 8775గా మారిపోయాడు.
 
కాగా, పంచాయతీ ఎన్నికల్లో భాగంగా, శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామంలో కింజారపు అప్పన్నపై నామినేషన్ల సమయంలో దాడి జరిగింది. ఈ కేసులో పోలీసులు అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు 14 రోజుల రిమాండ్ నిమిత్తం గార మండలం, అంపోలులోని జిల్లా జైలుకు ఆయన్ను తరలించారు. 
 
జైలు అధికారులు ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 8775ను కేటాయించారు. మంగళవారం సాయంత్రం తర్వాత జైలుకు చేరుకున్న ఆయన, ఆ రోజున మూడు చపాతీలు, చిక్కుడు కాయల కూర తిని, రాత్రి 9.30 గంటలకు నిద్రపోయారని జైలు అధికారులు తెలిపారు. 
 
కాగా, బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో నిద్రలేచి, టీ తాగారని, జైలు సిబ్బంది తెచ్చిన దినపత్రికలు చదివి, ఉదయం అల్పాహారంగా పొంగలి తిన్నారని అన్నారు. 
 
తాను ఎవరినీ కలవబోనని జైలు సిబ్బందికి అచ్చెన్నాయుడు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అయితే, నేడు లేదా రేపు లోకేశ్ సహా మరికొందరు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడిని కలవవచ్చని పోలీసులకు సమాచారం అందింది.

సంబంధిత వార్తలు

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

ఈ ఫుడ్ తింటే 50 ఏళ్లు దాటినా 30 ఏళ్ల వారిలా కనబడుతారు

తర్వాతి కథనం
Show comments