Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్‌లో ఉంటున్నవారిపై జాగ్రత్తలు : మంత్రి మోపిదేవి

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (09:03 IST)
గుంటూరు జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరగడం దురదృష్టకరమని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 109 పాజిటీవ్ కేసులు నమోదయినట్లుగా చెప్పారు.

ఇలాంటి సమయంలో క్వారంటైన్‌లో ఉంటున్నవారిపై జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ప్రజలు కూడా సామాజిక దూరం పాటించాలని మంత్రి కోరారు. కరోనాపై ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుదని చెప్పారు.

గుంటూరు జిల్లాలో మొత్తం 32 క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని,  5,190 మందికి వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 14 రోజులు క్వారంటైన్ పూర్తి అయిన తర్వాత ఇంటికి పంపించాలని ప్రభుత్వ అధికారులపై ఒత్తిడిలు వస్తున్నాయని మంత్రి మోపిదేవి అన్నారు.

అయితే 28 రోజులు క్వారంటైన్‌లో ఉంచాలని ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్నవారికి నెగిటీవ్ రిపోర్టు వచ్చి.. బయటకు వెళ్లిన తర్వాత వారికి మళ్లీ పాజిటీవ్ వచ్చే అవకాశం ఉందని, జాతీయ స్థాయిలో అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు.

ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 28 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టంగా చెబుతున్నామని, ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని మంత్రి మోపిదేవి కోరారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments