Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొత్తూరి వెంకటేశ్వర రావు మృతి పట్ల యార్లగడ్డ సంతాపం

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (19:11 IST)
పొత్తూరి వెంకటేశ్వర రావు
ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర రావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం ఛైర్మన్ ఆచార్య డాక్టర్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. సీనియర్ జర్నలిస్ట్‌గా పొత్తూరి సేవలు వెలకట్టలేనివన్న యార్లగడ్డ, పాత్రికేయుడిగా ఆరు దశాబ్దాల ఆయన గమనం చిరస్మరణీయమన్నారు. 
 
సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తనదైన ప్రత్యేక శైలి చూపిన పొత్తూరి మృతి తెలుగు జర్నలిజానికి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని యార్లగడ్డ తెలిపారు. పాత్రికేయులకు మార్గదర్శకునిగా, సామాజిక బాధ్యతతో విలువలతో కూడిన జర్నలిజాన్ని సాక్షిగా నిలిచారన్నారు. 
 
తన రచనలతో జాతిని జాగృతం చేయటమే కాక, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గానూ పొత్తూరి ఆ పదవికి వన్నె తెచ్చారని అచార్య యార్లగడ్డ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments