బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం : పోసాని కృష్ణమురళి

ఠాగూర్
గురువారం, 13 మార్చి 2025 (08:50 IST)
తనపై అక్రమ కేసులు బనాయించారని, ఈ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సినీ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళి వాపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను పరుష పదజాలంతో దూషించినందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదైవుండగా, ఈ కేసుల్లో పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో కోర్టులో హాజరుపరిచేందుకు కర్నూలు నుంచి గుంటూరుకు తీసుకొచ్చి, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 
 
ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట పోసాని బోరున విలపించారు. తనపై వ్యక్తిగత కోపంతో ఫిర్యాదు చేశారన్నారు. తన ఆరోగ్యం బాగోలేదని, ఇప్పటికి రెండు ఆపరేషన్లు జరిగాయని, స్టెంట్లు వేశారని గుర్తుచేశారు. 70 యేళ్ల వయసులో తనను ఇబ్బంది పెడుతున్నారు. తప్పు చేస్తే నన్ను నరికేయండి. రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే శరణ్య. అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పోసానికి పలు కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ సీఐడీ పోలీసులు పీటీ వారెంట్‌పై అదులోకి తీసుకోవడంతో విడుదల సాధ్యపడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

akhanda 2 Update: అఖండ 2 విడుదల కాకపోవటంతో ఎగ్జిబిటర్స్ చాలా నష్టపోయారు : నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments