Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా కుమార్తె హత్యకు అనుమతి ఇవ్వండి : తల్లిదండ్రుల వినతి

Webdunia
ఆదివారం, 6 డిశెంబరు 2020 (09:08 IST)
దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన తమ కుమార్తె హత్యకు అనుమతి ఇవ్వాలంటూ ఓ జంట న్యాయస్థానాన్ని మొరపెట్టుకుంది. అంటే మెర్సి కిల్లింగ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ చిత్తూరు జిల్లా కోర్టులో దాఖలైంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా మదనపల్లిలోని నీరుగట్టు వారిపల్లికి చెందిన ఓ జంటకు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ కుమార్తె ఉంది. ఆమె మంచానికే పరిమితమైంది. పైగా, ఆ జంటకు ఆర్థిక స్తోమత పెద్దగా లేదు. దీంతో అనారోగ్యం బారినపడిన కుమార్తె పోషణ ఆ జంటకు భారమైంది. 
 
పైగా, దాతల ఆర్థిక సాయం కోసం చాలా రోజులుగా ఎదురు చూశామని, ఎవరూ ముందుకు రాలేదన్నారు. అదేసమయంలో రోజురోజుకూ వ్యాధి ముదురుతుండటంతో తమ కళ్ల ముందు బిడ్డపడుతున్న బాధను చూడలేకపోతున్నామని పిటిషన్‌లో కోరారు. అందువల్ల తమ కుమార్తెను హత్యకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును వేడుకుంటున్నారు. అయితే, ఈ పిటిషన్‌కు కోర్టు స్వీకరిస్తుందా? లేదా అన్నది తేలాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments