Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామాల్లో మొద‌లైన రాజ‌కీయ క‌క్ష‌లు...కొప్ప‌ర్రులో టీడీపీ నేత గృహ‌ ద‌హ‌నం

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (12:56 IST)
స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డటంతో, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప‌లు గ్రామాల్లో రాజ‌కీయ క‌క్ష‌లు మ‌రోసారి వెలుగు చూస్తున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో పొడ‌చూపిన విభేదాలు, ఇపుడు మ‌ళ్లీ ఫ‌లితాల వెల్ల‌డితో భ‌గ్గుమంటున్నాయి.
 
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో  వినాయకుడి ఊరేగింపులో టి.డి.పి., వై.సి.పి  కార్యకర్తల మధ్య వివాదం చెల‌రేగింది. ఇరు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ చినికి, చినికి గాలివాన‌లా మారింది. వై.సి.పి కార్య‌క‌ర్త‌లు కొంద‌రు టి.డి.పి. మాజీ ఎంపీటీసీ స‌భ్యుడు వేణు ఇంట్లో  చొరబడి అడ్డం వచ్చిన వారిని చితకబాదారు. ఇంట్లో షర్నిచర్ ని  తగలబెట్టారు. 
 
ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘ‌ర్ష‌ణలో ఇద్ద‌రికి గాయ‌లు కాగా, వారిని అంబులెన్స్ లో హాస్పటల్ కి తరలించారు. ఈ దాడి సంఘ‌ట‌న‌లో కొన్ని బైక్ ల‌ను కూడా పెట్రోలు పోసి అగ్గి అంటించేశారు. చివ‌రిలో పోలీసులు వ‌చ్చి, ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments