గ్రామాల్లో మొద‌లైన రాజ‌కీయ క‌క్ష‌లు...కొప్ప‌ర్రులో టీడీపీ నేత గృహ‌ ద‌హ‌నం

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (12:56 IST)
స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డటంతో, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప‌లు గ్రామాల్లో రాజ‌కీయ క‌క్ష‌లు మ‌రోసారి వెలుగు చూస్తున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో పొడ‌చూపిన విభేదాలు, ఇపుడు మ‌ళ్లీ ఫ‌లితాల వెల్ల‌డితో భ‌గ్గుమంటున్నాయి.
 
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో  వినాయకుడి ఊరేగింపులో టి.డి.పి., వై.సి.పి  కార్యకర్తల మధ్య వివాదం చెల‌రేగింది. ఇరు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ చినికి, చినికి గాలివాన‌లా మారింది. వై.సి.పి కార్య‌క‌ర్త‌లు కొంద‌రు టి.డి.పి. మాజీ ఎంపీటీసీ స‌భ్యుడు వేణు ఇంట్లో  చొరబడి అడ్డం వచ్చిన వారిని చితకబాదారు. ఇంట్లో షర్నిచర్ ని  తగలబెట్టారు. 
 
ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘ‌ర్ష‌ణలో ఇద్ద‌రికి గాయ‌లు కాగా, వారిని అంబులెన్స్ లో హాస్పటల్ కి తరలించారు. ఈ దాడి సంఘ‌ట‌న‌లో కొన్ని బైక్ ల‌ను కూడా పెట్రోలు పోసి అగ్గి అంటించేశారు. చివ‌రిలో పోలీసులు వ‌చ్చి, ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments