Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులు బెదిరిస్తున్నారు: మాచర్ల పోలీసులపై ఎస్​ఈసీకి హైకోర్టు న్యాయవాదుల ఫిర్యాదు

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (11:56 IST)
మొదటి దశ పంచాయతీ ఎన్నికల విషయంలో.. గుంటూరు జిల్లా మాచర్ల పోలీసుల వ్యవహారశైలిపై ఎస్​ఈసీకి హైకోర్టు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. అభ్యర్థులను పోటీచేయకుండా బెదిరిస్తూ.. ఇంటిపన్ను రశీదులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని నిమ్మగడ్డ దృష్టికి తీసుకెళ్లారు.
 
గుంటూరు జిల్లా మాచర్లలో పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ చేయకుండా పోలీసులు బెదిరిస్తున్నారంటూ.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు న్యాయవాదులుగా పని చేస్తున్న కొందరు ఫిర్యాదు చేశారు. ఇంటి పన్ను రశీదును అభ్యర్థులకు ఇవ్వకుండా పోలీసులు అడ్డుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.
 
ఈ మేరకు పారా కిషోర్, ఇంద్రనీల్ బాబు నేతృత్వంలోని న్యాయవాదుల బృందం.. విజయవాడలోని ఆయన కార్యాలయంలో ఎస్​ఈసీని కలిశారు. మాచర్ల రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, దుర్గి ఎస్సై వ్యవహారశైలిపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.
 
తొలి దశ ఏకగ్రీవాల ఫలితాలు ప్రకటించకుండా ఎస్ఈసీ నిలుపుదల చేయగా.. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తుగా పర్యటన చేస్తామని నిమ్మగడ్డను అనుమతి కోరారు. మాచర్లలో రెండవ దశ ఎన్నికల తీరుపై అధ్యయనం చేసి నివేదిక అందించి సహకరిస్తామని విన్నవించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments