Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులు బెదిరిస్తున్నారు: మాచర్ల పోలీసులపై ఎస్​ఈసీకి హైకోర్టు న్యాయవాదుల ఫిర్యాదు

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (11:56 IST)
మొదటి దశ పంచాయతీ ఎన్నికల విషయంలో.. గుంటూరు జిల్లా మాచర్ల పోలీసుల వ్యవహారశైలిపై ఎస్​ఈసీకి హైకోర్టు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. అభ్యర్థులను పోటీచేయకుండా బెదిరిస్తూ.. ఇంటిపన్ను రశీదులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని నిమ్మగడ్డ దృష్టికి తీసుకెళ్లారు.
 
గుంటూరు జిల్లా మాచర్లలో పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ చేయకుండా పోలీసులు బెదిరిస్తున్నారంటూ.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు న్యాయవాదులుగా పని చేస్తున్న కొందరు ఫిర్యాదు చేశారు. ఇంటి పన్ను రశీదును అభ్యర్థులకు ఇవ్వకుండా పోలీసులు అడ్డుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.
 
ఈ మేరకు పారా కిషోర్, ఇంద్రనీల్ బాబు నేతృత్వంలోని న్యాయవాదుల బృందం.. విజయవాడలోని ఆయన కార్యాలయంలో ఎస్​ఈసీని కలిశారు. మాచర్ల రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, దుర్గి ఎస్సై వ్యవహారశైలిపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.
 
తొలి దశ ఏకగ్రీవాల ఫలితాలు ప్రకటించకుండా ఎస్ఈసీ నిలుపుదల చేయగా.. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తుగా పర్యటన చేస్తామని నిమ్మగడ్డను అనుమతి కోరారు. మాచర్లలో రెండవ దశ ఎన్నికల తీరుపై అధ్యయనం చేసి నివేదిక అందించి సహకరిస్తామని విన్నవించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments