తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదు.. బాలికను కిడ్నాప్ చేశారు.. కానీ 2 గంటల్లోనే?

సెల్వి
శనివారం, 16 ఆగస్టు 2025 (12:59 IST)
తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని బాలికను కిడ్నాప్ చేసిన కేసును పోలీసులు రెండు గంటల్లోనే ఛేదించి 13 ఏళ్ల బాలికను సురక్షితంగా రక్షించారు. ఇంకా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చీమకుర్తికి చెందిన శ్రీనివాస్ కరోనా సమయంలో జీవనోపాధి కోసం తన కుటుంబంతో తిరుపతికి వెళ్ళాడు. అక్కడ ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి వద్ద రూ.5 లక్షలు అప్పు తీసుకున్నాడు. 
 
ఇటీవల శ్రీనివాస్ కుటుంబం తిరిగి స్వగ్రామానికి వచ్చింది. అప్పు తిరిగి చెల్లించకపోవడంతో, ఈశ్వర్ రెడ్డి నిన్న చీమకుర్తికి వచ్చి, శ్రీనివాస్ కుమార్తె చదువుతున్న పాఠశాల వద్దకు వెళ్ళి.. బాలికను కిడ్నాప్ చేశాడు. అనంతరం బాలిక చేతే ఆమె తండ్రికి ఫోన్ చేయించి, "రూ.5 లక్షలు తిరిగి ఇస్తేనే అమ్మాయిని వదులుతా, లేకపోతే చంపేస్తా" అని బెదిరించాడు. 
 
ఈ ఘటనపై తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వేగవంతంగా దర్యాప్తు జరిపించి కేసును చేధించారు. చివరికి కావలి సమీపంలో ఈశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని, బాలికను సురక్షితంగా కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుక్కలు పోతాయ్, పిల్లులు పోతాయ్, కోతులు పోతాయ్, మనమూ పోతాం: రేణు దేశాయ్

ఆస్కార్ నామినేషన్స్ 2026 జాబితా ఇదే.. ఇండియన్ మూవీలకు దక్కని చోటు

తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్ర రాజం గొల్ల రామవ్వ

VD 14: రౌడీ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా వీడీ 14 సినిమా ఉంటుంది - రాహుల్ సంకృత్యన్

Anil Ravipudi: చిరంజీవి తో మరో సినిమా - రాజమౌళితో కంపారిజన్ లేదు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments