Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో పోలీసు రాజ్యం: వర్ల రామయ్య

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (22:22 IST)
రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు.

ఎన్నికల సమయంలో అన్ని ప్రభుత్వ శాఖలు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉండగా.. డీజీపీ గౌతం సవాంగ్‌ నేతృత్వంలో పోలీసు వ్యవస్థ మాత్రమే రాజ్యమేలుతోందని ఆరోపించారు.

కుప్పంలో పోలీసుల తీరుపై ఆయన బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాటాడుతూ మంగళవారం రాత్రి 10.45 గంటలకు కుప్పంలో టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారని, 41 నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆయన నిలదీశారు. 

డీజీపీ నేతృత్వంలో అధికార పార్టీ స్థానికంగా ఏది చెబితే అదే చేస్తున్నారని, ఆ పద్ధతి మంచిది కాదని హితవు పలికారు.

అధికార పార్టీ చెప్పిందల్లా చేస్తే భవిష్యత్‌లో పోలీసులు ఇబ్బంది పడతారని వర్ల రామయ్య హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధన్య బాలకృష్ణ ఇన్వెస్టిగేషన్ హత్య చిత్రం ఎలా వుందంటే.. హత్య రివ్యూ

అఖండ 2: తాండవంలో సంయుక్త - చందర్లపాడులో షూటింగ్ కు ఏర్పాట్లు

ట్రైబల్ గర్ల్ పాయల్ రాజ్‌పుత్ యాక్షన్ రివైంజ్ చిత్రంగా 6 భాష‌ల్లో వెంక‌ట‌ల‌చ్చిమి ప్రారంభం

కృష్ణ తత్త్వాన్ని తెలియజేసిన డియర్ కృష్ణ- సినిమా రివ్యూ

జపనీస్ యానిమేషన్ చిత్రం రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ- రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments