Webdunia - Bharat's app for daily news and videos

Install App

జన జాతరలా అమరావతి రైతుల మహాపాదయాత్ర

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (22:18 IST)
అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలో జన జాతరలా సాగుతోంది. ఊరూరా ప్రజలు కదలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారు.

పూలజల్లులు, మేళతాళాలు, కళాప్రదర్శనలతో వేలాది మంది పాదయాత్రకు మద్దతుగా నడుస్తున్నారు.

ఈ నెల 1న అమరావతిలో జేఏసీ ప్రారంభించిన మహాపాదయాత్ర పదోరోజైన బుధవారం మొత్తం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14 కి.మీ సాగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

జిల్లాలోని టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, డాక్టర్‌ స్వామిలతోపాటు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు పాదయాత్రలో పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు.

గత రాత్రి బస చేసిన పర్చూరు నియోజకవర్గంలోని దుద్దుకూరులో బుధవారం ఉదయం జేఎసీ నేతలతో కలిసి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు యాత్రను ప్రారంభించారు.

ఆ గ్రామంతోపాటు పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి సంఘీభావం తెలిపి యాత్రలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments