Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాలలో దారుణం.. కానిస్టేబుల్‌ను వెంటాడి వేటాడిన రౌడీషీటర్

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (08:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్‌ను నడిరోడ్డుపై రౌడీ షీటర్ చంపేశాడు. కానిస్టేబుల్‌ను వెంటాడి మరీ హత్య చేశాడు. తొలుత తలపై బీరు సీసాతో తొట్టిన రౌడీలు.. ఆ తర్వాత ఆటోలో చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ హత్య కేసు దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
నంద్యాల పట్టణంలో ఆదివారం రాత్రి టాటూ దుకాణం వద్ద మద్యం సేవిస్తున్న ఆరుగురు రౌడీ షీటర్లకు కానిస్టేబుల్ సురేంద్ర కుమార్ (35) కనిపించాడు. దీంతో ఆయన్ను అడ్డగించి వాగ్వివాదానికి దిగారు. మాట్లాడుతుండగానే ఓ రౌడీ బీరు బాటిల్‌తో దాడిచేసాడు.
 
అయితే, రౌడీలు ఎక్కువ మంది ఉండటంతో అక్కడ నుంచి తప్పించుకునేందుకు అతను ప్రయత్నించినప్పటికీ సఫలంకాలేకపోయాడు. దీంతో రౌడీలంతా కలిసి పోలీస్ కానిస్టేబుల్‌ను ఆటోలో ఎక్కించుకుని చెరువు కట్టవద్దకు తీసుకెళ్లి కత్తులతో పొడిచి హత్య చేశాడు. 
 
ఆ తర్వాత ముగ్గురు రౌడీలు అక్కడ నుంచి పారిపోగా, మరికొందరు పట్టణంలోకి వెళ్లి స్థానికులను బెదిరించి వారి బైకులను లాక్కొని పారిపోయారు. కాగా, మృతుడు సురేంద్ర కుమార్ స్థానిక డీఎస్పీ కార్యాలయంలో క్లర్కుగా పని చేస్తున్నాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments