Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం... జేసీ ప్రభాకర్ రెడ్డి

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (07:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాయలసీమలో గట్టిపట్టున్న రాజకీయ నేతల్లో ఒకరైన జేసీ దివాకర్ రెడ్డి సోదరుడైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిని హైదరాబాదు శివారు శంషాబాద్‌లో వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతపురానికి తరలిస్తున్నారు. 
 
వీరిద్దరూ నకిలీ ధ్రువపత్రాలతో బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారన్న రవాణాశాఖ అధికారుల ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం 154 లారీలను ఇలా అక్రమంగా వీరు రిజిస్ట్రేషన్ చేయించినట్టు అధికారులు పేర్కొన్నారు. 
 
నిజానికి జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరులు అంటే రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమే. వీరిద్దరూ జేసీ ట్రావెల్స్ పేరుతో ప్రైవేటు బస్సులను నడుపుతున్నారు. అలాగే, లారీలు కూడా ఉన్నాయి. అయితే, ఒకే రిజిస్ట్రేషన్ నంబరుతో అనేక లారీలు, బస్సులు నడుపుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ క్రమంలో రవాణా శాఖ అధికారులు చేసిన ఆరోపణల నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments