Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి పోలవరం గుండెలాంటిది: కన్నా

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (08:15 IST)
ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు గుండె లాంటిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మోదీ ప్రధాని అయ్యాక పోలవరం ప్రాజెక్టు కోసం ముంపు ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపారని వెల్లడించారు.

ఇంతటి గొప్ప ప్రాజెక్టు పూర్తి చేయడానికి నూటికి నూరుశాతం నిధులు ఇచ్చి పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని పర్యాటక కేంద్రంగా చూసిందే తప్ప.. సీరియస్‌గా ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయిందన్నారు.

ఈ నాలుగు నెలల్లో ప్రాజెక్టు పనులు ఎక్కడ వరకు వచ్చాయో చూద్దామని పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నట్లు తెలిపారు. పోలవరంలో అవినీతిని నిరూపించి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

పోలవరంలో అవినీతి ఎక్కడ జరిగిందో కనిపెట్టలేకపోయిందని ఎద్దేవాచేశారు. ఈనెల 13న సాయంత్రం 6 గంటలకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని కలిసి ఒక నివేదిక అందజేస్తామని స్పష్టం చేశారు. పోలవరం పురోగతి, అవినీతి ఆరోపణలపై వివరిస్తామన్నారు.

పోలవరం త్వరగా పూర్తి కావాలనేదే బీజేపీ సంకల్పమని వివరించారు. జగన్ సర్కారు పోలవరం అవినీతి బూచి చూపించి కావాల్సిన పనులు చేయించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments