Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయరామ్‌ను ఒక్కరే చంపలేదు.. పిడిగుద్దులతో ఐదుగురు..?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (08:53 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోస్టల్ బ్యాంక్ డైరక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చిగురుపాటిని హత్య చేసింది.. రాకేష్ మాత్రమే కాదని.. ఆయన హత్యోదంతంలో నలుగురి పాత్ర వుందని తాజాగా పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది. జయరామ్‌ను హత్య చేసిన వారిలో ఐదుగురు బయటి వ్యక్తుల హస్తం కూడా వున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇంకా జయరామ్ హత్య కేసుకు సంబంధించిన ప్రాథమిక విచారణలో పెనుగులాట, పిడిగుద్దుల వల్లే ఆయన మరణించాడని తెలిపింది. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఏపీలో ఉన్న నిందితుల్ని పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి విచారించాలని జూబ్లీహిల్స్ పోలీసులు నిర్ణయించారు. ఇందుకోసం నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్ కూడా తీసుకున్నారు. 
 
అలాగే ఈ కేసును జయరామ్ భార్య పద్మ శ్రీ పిటిషన్‌లో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా జయరామ్ మేనకోడలు శిఖాచౌదరిని కూడా విచారిస్తామని  వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments