Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించలేదని డిగ్రీ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (10:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో దారుణం జరిగింది. ప్రేమించలేదన్న అక్కసుతో డిగ్రీ విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది ప్రెట్రోల్ పోసి నిప్పంటించాడు. ప్రస్తుతం ఆ యువతి 80 శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 
 
బుధవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, హన్మకొండ రామచంద్రపుర్‌కు చెందిన రవళి (20) అనే విద్యార్థిని స్థానికంగా ఉండే ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఈ యువతి వెంట అవినాష్ అనే యువకుడు ప్రేమ పేరుతో వెంటపడుతూ వచ్చాడు. అయినప్పటికీ రవళి అతన్ని పట్టించుకోలేదు.
 
ఈ క్రమంలో తనను ప్రేమించాలని పట్టుబడిన అవినాష్.. బుధవారం ఉదయం కాలేజీకి వెళుతున్న రవళిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులను కూడా అవినాష్ బెదిరించాడు. దీంతో వారు ఏం చేయలేక మిన్నకుండిపోయారు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రవళిని స్థానికంగా ఉండే ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న అవినాష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments