Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయపెడుతున్న పెథాయ్ : ఆంధ్రప్రదేశ్‌ అప్రమత్తం

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (15:13 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడివున్న వాయుగుండం ఇపుడు తుఫానుగా మారింది. ఈ తుఫానుకు పెథాయ్ అనే పేరు పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భయపెడుతోంది. దీంతో రాష్ట్ర యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్రమత్తం చేశారు. 
 
శుక్రవారం కేంద్ర వాతావరణ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం... మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశలో 1030 కిలోమీటర్లు, చెన్నైకు 930 కిలోమీటర్ల దూరంలో పెథాయ్ కేంద్రీకృతమైవుంది. 
 
ఇది వచ్చే 12 గంటల్లో మరింతగా బలపడి తుఫాన్‌గా మారుతుందని, 36 గంటల్లో అతి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని తెలిపింది. ప్రస్తుతం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పెథాయ్ తీరం వైపు దూసుకొస్తున్నట్టు తెలిపింది. 
 
తుఫాన్ ప్రభావంతో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు కోస్తాంధ్ర అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తీరం వెంబడి పెను గాలులు వీయడంతోపాటు సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని తెలిపింది. తీరందాటే సమయంలో 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయిని, అందువల్ల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని తెలిపింది. 
 
అదేసమయంలో ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం మార్పులను అమరావతిలోని ఆర్టీజీఎస్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో రేపటి నుంచి గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. ఈ నెల 16, 17 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కలాం గా ధనుష్ - కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టైటిల్ ఆవిష్కరణ

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments