Webdunia - Bharat's app for daily news and videos

Install App

దున్నపోతు ఈనిందంటే, దూడను కట్టేస్తానని చెప్పే రకం.. ఎవరు?

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (18:14 IST)
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్‌లపై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు అనుభవం వుండి ఏం లాభం అంటూ ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు పరిస్థితి ఏమైందంటూ ప్రశ్నించారు. 
 
అంతేగాకుండా కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ సీఎం జగన్‌ను అభ్యర్థించారని పేర్నినాని గుర్తు చేశారు. 1979 నాటికే 13 జిల్లాలు ఏర్పడినప్పుడు, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత జనాభా పెరిగింది, ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలి? ఆ మాత్రం తెలియదా? అంటూ పేర్నినాని ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
పనిలో పనిగా పవన్‌పై కూడా ధ్వజమెత్తారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ఎంత చెబితే అంత… చంద్రబాబు దున్నపోతు ఈనిందంటే, దూడను కట్టేస్తానని చెప్పే రకం పవన్ కల్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ ఇస్తే పవన్ ఎక్కడున్నాడు? అని ప్రశ్నించారు. 
 
ప్రభుత్వాన్ని కలిసి ఏమైనా అభిప్రాయాలను పంచుకున్నాడా? నిలదీశారు. చంద్రబాబు ఆఫీసు నుంచి వచ్చిన దానిపై సంతకం చేయడం తప్ప ఏంచేశాడు? అంటూ పవన్‌పై పేర్ని నాని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Sobhita: తమిళ సినిమా కోసం సంతకం చేసిన శోభిత దూళిపాళ

"అర్జున్ రెడ్డి" వల్లే గుర్తింపు - క్రేజ్ వచ్చింది : షాలినీ పాండే

'కాంతార చాప్టర్-1'కు ఆటంకాలు కలిగించొద్దు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ 'ఓజీ' కోసం ఒక్కతాటిపైకి మెగా ఫ్యామిలీ

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments