Webdunia - Bharat's app for daily news and videos

Install App

దున్నపోతు ఈనిందంటే, దూడను కట్టేస్తానని చెప్పే రకం.. ఎవరు?

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (18:14 IST)
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్‌లపై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు అనుభవం వుండి ఏం లాభం అంటూ ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు పరిస్థితి ఏమైందంటూ ప్రశ్నించారు. 
 
అంతేగాకుండా కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ సీఎం జగన్‌ను అభ్యర్థించారని పేర్నినాని గుర్తు చేశారు. 1979 నాటికే 13 జిల్లాలు ఏర్పడినప్పుడు, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత జనాభా పెరిగింది, ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలి? ఆ మాత్రం తెలియదా? అంటూ పేర్నినాని ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
పనిలో పనిగా పవన్‌పై కూడా ధ్వజమెత్తారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ఎంత చెబితే అంత… చంద్రబాబు దున్నపోతు ఈనిందంటే, దూడను కట్టేస్తానని చెప్పే రకం పవన్ కల్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ ఇస్తే పవన్ ఎక్కడున్నాడు? అని ప్రశ్నించారు. 
 
ప్రభుత్వాన్ని కలిసి ఏమైనా అభిప్రాయాలను పంచుకున్నాడా? నిలదీశారు. చంద్రబాబు ఆఫీసు నుంచి వచ్చిన దానిపై సంతకం చేయడం తప్ప ఏంచేశాడు? అంటూ పవన్‌పై పేర్ని నాని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments