విశాఖపట్నంలో ఓలా క్యాబ్ లకు అనుమతి

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (19:02 IST)
ఆంధ్రప్రదేశ్ లో అత్యవసర వైద్య సదుపాయం అవసరమయ్యే పౌరులకు రవాణా కోసం ఓలా క్యాబ్ లకు  విశాఖపట్నం నగరంలో పైలట్ ప్రాజెక్ట్ గా అనుమతించడం జరిగిందని రాష్ట్ర రవాణా, రోడ్లు & భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి (రాష్ట్ర సమన్వయకర్త) ఎమ్. టి.కృష్ణ బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
 
కోవిడ్ కాకుండా డయాలసిస్, క్యాన్సర్, గుండె జబ్బులు తదితర రోగులను ఆసుపత్రులకు తీసుకుని వెళ్ళడానికి, తిరిగి ఇళ్లకు తీసుకుని వెళ్లాడానికి అనుమతించడం జరిగిందన్నారు.

అలాగే విధుల్లో ఉన్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది విధులకు హాజరుకావడానికి ఈ సడలింపు ఇవ్వడం జరిగిందన్నారు. పైలట్ గా విశాఖపట్నంలో అమలుకు అనుమతించడం జరిగిందన్నారు.
 
కర్ణాటక రాష్ట్రంలో ఆరోగ్య శాఖ, ప్రభుత్వ సహకారంతో కర్ణాటక రాష్ట్రంలో ఇటువంటి అనుమతులు ఇవ్వడం జరుగుతున్నాయని, తమకు అవకాశం ఇవ్వాలని ఓలా సంస్థ కోరారన్నారు. రవాణా, పోలీసు విభాగాలతో సంప్రదించి పై అభ్యర్థనను పరిశీలించి,  ఓలా క్యాబ్ వారి అభ్యర్థన మేరకు ఈ సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నంలో ట్రయల్  ప్రాతిపదికన ప్రారంభించాలని నిర్ణయించామన్నారు.

ఈ సౌకర్యం వైద్య అత్యవసర సందర్భాల్లో మాత్రమే ఉపయోగించుకోవాలని తెలిపారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ, ప్రమాణాలకు లోబడి డ్రైవర్‌ను మినహాయించి ప్రయాణికుల సంఖ్య ఇద్దరు మాత్రమే ఉండాలన్నారు. ఈ ప్రయాణ క్రమంలో వినియోగదారులు మాస్కులు, శానిటైజర్లను ఉపయోగించాలన్నారు.

నియమాలను అతిక్రమించి  ప్రయాణలను తీవ్రంగా పరిగణించబడుతుందని హెచ్చరించారు. క్యాబ్ క్రమం తప్పకుండా డిస్ ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్  చేయడం మరియు శుభ్రపరచడం చేయాలన్నారు. తద్వారా ప్రయాణీకుల భద్రతను ఖచ్చితంగా పాటించాలని ఆయన తెలియచేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments