అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (03:23 IST)
సోషల్ ఆడిట్ జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించిన అనంతరం అనర్హులుగా ప్రకటించిన వారిని మరొకసారి  పూర్తిస్థాయిలో  పరిశీలించిన పిమ్మట అర్హులైతే వారికి కూడా పెన్షన్ అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) సీఈవో పి. రాజబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద అందజేస్తున్న అన్ని రకాల పెన్షన్లను  ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలకు లోబడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందజేయడం జరుగుతుందని, అందులో భాగంగా సోషల్ ఆడిట్ లో అర్హులుగా నిర్ధారణ అయిన లబ్ధిదారులకు ఈనెల పెన్షన్ మరియు వచ్చే నెల పెన్షన్ ను ఒకేసారి  అందజేయడం జరుగుతుందని సీఈవో వెల్లడించారు.

నిజమైన లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసానిచ్చారు. పెన్షన్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పూర్తి పారదర్శకంగా పెన్షన్లను మంజూరు చేస్తామని వెల్లడించారు.

ఎప్పటికప్పుడు సోషల్ ఆడిట్ మాదిరిగా నోటీస్ బోర్డుల్లో అర్హుల జాబితాలు ప్రకటిస్తామని కావున లబ్ధిదారులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. కేవలం పేదరికంను మాత్రమే కొలబద్దగా చూస్తున్నామని గుర్తుచేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందాలన్న తపనతోనే ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ శ్రీనివాస్ మోసం చేశారంటున్న మరో హీరోయిన్

అమ్మాయిలను వాడుకునేందుకు కొందరు సినిమాలు తీస్తున్నారు : నిర్మాత తమ్మారెడ్డి

Raveena Tandon : జయ కృష్ణ ఘట్టమనేని కి జోడీగా రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ పరిచయం

రణబాలి, రౌడీ జనార్థన చిత్రాలతో అలరించనున్న విజయ్ దేవరకొండ

Rajamouli: మహేష్ బాబు.. వారణాసి చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించిన రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం

Marua leaves: మరువా తులసి ఔషధ గుణాలు.. ఇంట్లో వుంటే పాములు రావట!

ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ

వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?

తర్వాతి కథనం
Show comments