Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వాహనదారులకు జరిమానా బాదుడు

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (06:11 IST)
ఏపీలోని వాహన దారులకు ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. వాహన జరిమానాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బైక్‌ నుంచి 7 సీటర్‌ కార్ల వరకూ ఒకే తరహా జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10వేలు, రేసింగ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ.5 వేలు, రెండోసారికి రూ.10 వేల జరిమానా విధించనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.

పర్మిట్‌ లేని వాహనాలు నడిపితే రూ.10 వేలు, ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుండా మొదటిసారి పట్టుబడితే రూ.2వేలు, రెండోసారి పట్టుబడితే రూ.5వేల జరిమానా విధించనున్నట్లు తెలిపింది.

వాహన బరువు చెకింగ్‌ కోసం ఆపకపోతే రూ.40 వేలు, ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తామని ప్రకటించింది.

అనవసరంగా హారన్‌ మోగిస్తే మొదటిసారి రూ.వెయ్యి, రెండోసారి రూ.2 వేలు జరిమానా విధిస్తామని తెలిపింది. వేగంగా వాహనం నడిపితే రూ. వెయ్యి జరిమానా వేస్తామని స్పష్టం చేసింది. తాజా ప్రభుత్వ ఉత్తర్వులపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: మాస్ జాతర చిత్ర విడుదలతేదీని ప్రకటించిన నిర్మాత నాగ వంశీ

Naga vamsi: ఓజీ హైప్ అయిపోయింది, అంతా ఉత్సాహంగా ఉంది అంటున్న నాగవంశీ

CM: కర్నాటక ముఖ్యమంత్రిని, సూపర్ స్టార్ సుదీప్ ను కలిసిన మంచు మనోజ్

OG: ఓజీ కోసం థియేటర్లు వదులుకున్న ఓ నిర్మాత - పబ్లిసిటీచేస్తున్న మరో నిర్మాత

Nayanthara : సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి కెమిస్ట్రీ బాగుందన్న నయనతార

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments