Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూతన విద్యా విధానానికి స్వాగతం పలికిన పవన్ కల్యాణ్

Webdunia
గురువారం, 30 జులై 2020 (16:42 IST)
నూతన విద్యా విధానానికి స్వాగతం పలికారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరగాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదని తెలిపారు. మాతృ భాషలో బోధన జరిగినప్పుడు గొప్ప ఫలితాలు ఆవిష్కృతమవుతాయని యునెస్కో 2008లో ప్రకటించిందని తెలిపారు.
 
ఇటీవల ఏపీ సర్కారు ఇంగ్లీషు మీడియంపై నిర్ణయం తీసుకున్నప్పుడు జనసేన తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే జనసేన ఇంగ్లీష్ మీడియం బోధనకు ఏమాత్రం వ్యతిరేకం కాదని ఏపీలో ఇంగ్లీషు మీడియాన్ని తప్పనిసరి చేసినప్పుడు మాత్రమే వ్యతిరేకించామని పేర్కొన్నారు. తమ పిల్లలు ఏ భాషలో చదవాలన్న విషయాన్నితల్లిదండ్రుల నిర్ణయానికి వదిలేయాలని, ఇంగ్లీష్ మీడియం ఒక ఆప్షనల్‌గా మాత్రమే ఉండాలన్నది జనసేన పార్టీ అభిప్రాయమన్నారు.
 
తాజా ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలో జరగాలని నిర్ణయించిన సభ్యులకు, కమిటీ సిఫారుసులను ఆమోదించిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments