మాకు ఏమైనా జరిగితే బాధ్యత డీజీపీదే : పవన్ హెచ్చరిక

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (09:31 IST)
తాను సాగిస్తున్న ప్రజా పోరాట యాత్రలో తనకు లేదా తన పార్టీ జనసైనికులకు ఏమైన జరిగితే దానికి డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి ఎలాగూ బాధ్యత లేదని.. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత డీజీపీకి ఉందని గుర్తుచేశారు. 
 
'ఇటీవల రాజానగరం సభకు వెళ్లి వస్తుంటే మా సెక్యూరిటీ సిబ్బంది ప్రయాణించే కారును ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. మా పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ హైదరాబాద్‌లో ఇంటికి వెళ్లే సమయంలో ఇసుక లారీ ఆయన కారును ఢీకొట్టింది. కోడికత్తి విషయంలో స్పందించిన ప్రభుత్వం నా విషయంలో ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. 
 
నిజానికి నాదెండ్ల మనోహర్‌కు అంగరక్షకులను ఇవ్వాలని నెల కిందట రాష్ట్ర డీజీపీకి లేఖ రాశాం. ఇప్పటివరకూ ప్రభుత్వం స్పందించ లేదని ఆరోపించారు. సత్తా, సమర్థత లేని చంద్రబాబు పాలన కావాలా.. బాధ్యత లేకుండా రోడ్లపై తిరిగే జగన్‌ కావాలా.. రూ.100 కోట్ల ఆదాయాన్ని వదిలిపెట్టి మీకోసం రోడ్లపైకి వచ్చిన తాను కావాలో మీరే నిర్ణయించుకోవాలని ప్రజలకు పవన్‌ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments