Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిలాఫలకాలు వేసి మర్చిపోయే వారికి మద్దతివ్వను : పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల పొత్తు అంశంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శిలాఫలకాలు వేసి మర్చిపోయే వారికి కాకుండా, అభివృద్ధి చేసే వారికే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (09:01 IST)
వచ్చే ఎన్నికల పొత్తు అంశంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శిలాఫలకాలు వేసి మర్చిపోయే వారికి కాకుండా, అభివృద్ధి చేసే వారికే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీతో పొత్తు కొనసాగించే అంశంపై ప్రజాభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 
 
తన అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా, ఆయన మాట్లాడుతూ, తన వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది ఇంకా నిర్ణయించుకోలేదని, సమయం వచ్చినపుడు ప్రకటిస్తానని తెలిపారు. కష్టాలు ఎక్కడుంటాయో పరిష్కారం కూడా అక్కడే ఉంటుందన్నారు. అందుకే అనంతపురాన్ని దత్తత తీసుకున్నానని తెలిపారు.
 
నీటి ప్రాజెక్టుల విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు తన దృష్టికి తెస్తే ప్రభుత్వాలతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతపురం అభివృద్ధికి నీరే ప్రధానమన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందన్నారు. దానిపై ఉన్న ఇబ్బందులను తెలుసుకుని ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు. పరిటాల కుటుంబంతో తనకు విభేదాలు ఉన్నాయన్న ప్రచారంలో వాస్తవం లేదని ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments